బాలసోర్(ఒడిషా) : అధునాతన పరిజ్ఞానంతో నిర్మించిన పైలెట్ రహిత లక్ష్యాత్మక ఎయిర్క్రాఫ్ట్ ''లక్ష్య-2''ని ఇక్కడి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుండి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. ఇక్కడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటిఆర్ లాంచ్ కాంప్లెక్స్-3 వద్ద మొబైల్ వెహికల్ నుండి దీనిని ప్రయోగించారు. ఇటువంటి ప్రయోగాన్నే బుధవారం కూడా జరిపారు. ఈ మొత్తం ప్రక్రియనంతటిని మొత్తంగా ఒక్కసారి చూసుకునేందుకు ముందస్తు ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించారు. ఇది పూర్తిగా విజయవంతమైందని రక్షణ వర్గాలు తెలిపాయి.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
