హైదరాబాద్ (వివి) : ఐఎఫ్ఎం 2012-14 బ్యాచ్ రెండేళ్ల ఫుల్టైమ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజిమెంట్ (పిజిడిఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్-ఇంటర్నేషనల్ బిజినెస్ (పిజిడిఎం-ఐబి), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్-ఫైనాన్స్ (పిజి డిఎం-ఫైనాన్స్) కోర్సులు వీటిలో ఉన్నాయి.
ఈ ప్రోగ్రామ్లు ఎఐసిటిఇ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఎన్బిఎ, ఎఐయూ ఆమోదం, గుర్తింపు పొందాయి. వీటిల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు రాసి ఉండి, గ్రాడ్యుయేషన్లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. సంబంధిత పరీక్షల్లో కనీస కటాఫ్ స్కోర్ 60 శాతం. తుది ఎంపిక కోసం ప్రతి విద్యార్థి కూడా బిడి, పిఐకి హాజరు కావాలి. (రిలయన్స్ వరల్డ్ కేంద్రాల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఉంది). దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 28.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
