టెక్నాలజీ దుర్వినియోగ నివారణకు చర్యలు : సిబల్‌

Wed, 22 Aug 2012, IST    vv

న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుర్విని యోగం కాకుండా నిరోధించేదుకు సోషల్‌ నెట్‌వ ర్కింగ్‌ సైట్లకు సంస్థాగత యంత్రాంగాన్ని త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని బుధ వారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత వెబ్‌సైట్లు కొన్ని కుల, మతాలకు సంబంధించిన పగ, ద్వేషా లను, వైషమ్యాలను వ్యాప్తి చేస్తున్నాయని, దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం నివారణ చర్యలకు పూనుకు న్నదని టెలికాం శాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ పేర్కొ న్నారు. పార్లమెంట్‌ బయట సిబల్‌ విలేకరులతో మాట్లాడుతూ వెబ్‌సైట్ల్‌ను ఉపయోగించే వారి సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకునేందుకు కొన్ని సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లు అంగీకరించా యని, అయితే ఇందుకు కొన్ని విధానపరమైన అంశాలతో సంబంధం వున్నదని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కాకుండా సంస్థాగత యంత్రాంగాన్ని సృష్టించుకునే విధంగా ప్రభావితం చేస్తున్నామని, దీనికి సంబంధించి వెబ్‌సైట్లతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే టెక్నాలజీని దుర్వినియోగ పరిచే వారిని శిక్షించేందుకు అవకాశం వుంటుందని, ప్రస్తుతం ఈ విధమైన ఏర్పాటు అందుబాటులో లేదని ఆయన స్పష్టం చేశారు. మన చట్టాల పరిధిలో ఈ విధమైన చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు అనే అంశంపై తాము నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు