కరాచి : 'స్పాట్ ఫిక్సింగ్ ' స్కాంలో నాలుగో నిందితునిగా వున్న పేసర్ వాహబ్ రియాజ్ను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు బుధవారం విచారించనున్నారు. వాస్తవానికి మంగళవారం ఈ విచారణ జరగాల్సి వున్నా రేపటికి వాయిదా పడిందని పాక్ జట్టు మేనేజర్ యవార్ సయీద్ పేర్కొన్నారు. కాగా, వత్తిడుల కారణంగానే రియాజ్ విచారణకు తాము అంగీకరించామని వెలువడుతున్న వార్తలను పిసిబి ఖండిస్తూ, ఈ ఆరోపణలపై పరిశోధనకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే రియాజ్ను వన్డే జట్టులో కొనసాగించరాదని కూడా ఎలాంటి వత్తిడులు రాలేదని పిసిబి లీగల్ అడ్వయిజర్ తఫాజుల్ రిజ్వి వ్యాఖ్యానించారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
